భక్తులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు డిస్పెన్సరీలో ఈసీజీ, ఆక్సిజన్ సదుపాయం, ఆధునిక వైద్య పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది సేవలందించనుండగా, 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, ఎస్ఎంఓ డాక్టర్ సుహర్ లత, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, డాక్టర్ పద్మజ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏఈవో శ్రీ మణి, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments