VIDEO
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్ షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుం డి 29 వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి . ప్ర తిరోజూ సాయంత్రం 6.30 గంటల నుం డి రాత్రి 7.30 గంటల వరకు పద్ మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ పద్మా వతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శ నమివ్వనున్నారు .
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌ ర్ణమి వరకు జరిగే ఈ పవిత్ర తెప్ పోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ని దర్శించుకుంటే భక్తుల కష్టా లు తొలగి, దైవానుగ్రహంతో సుఖశాం తులు కలుగుతాయని పురాణాలు చెబు తున్నాయి.
భక్తులను కాపాడే పద్మావతి అమ్ మవారు
పద్మసరోవరంలోని బంగారు పద్మం నుం డి అవతరించిన శ్రీ పద్మావతి అమ్ మవారు జగజ్జననిగా భక్తులను అన్ ని కష్టాల నుండి కాపాడి, సుఖశాం తులు ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలి యజేస్తాయి. పద్మసరోవరంలో అమ్మవా రి తెప్ప విహారం దర్శించుకోవడం భక్తులకు అపూర్వమైన దివ్యానుభూ తిని కలిగిస్తుంది.
ఉత్సవాల విశేషాలు
జూన్ 25: రుక్మిణి, సత్యభామ సమే త శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్ సవం – 3 ప్రదక్షిణలు
జూన్ 26: శ్రీ సుందరరాజస్వామివా రి తెప్పోత్సవం – 3 ప్రదక్షిణలు
జూన్ 27 నుండి 29 వరకు: శ్రీ పద్మా వతి అమ్మవారి తెప్పోత్సవం
జూన్ 27 – 3 ప్రదక్షిణలు
జూన్ 28 – 5 ప్రదక్షిణలు
జూన్ 29 – 7 ప్రదక్షిణలు
తిరుమంజనం
ఉత్సవాల చివరి మూడు రోజులైన జూ న్ 27, 28, 29 తేదీలలో పద్మసరోవరంలోని నీరా డ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుం డి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్ మవారికి తిరుమంజనం ఘనంగా నిర్ వహించనున్నారు.
గజవాహన , గరుడవాహన సేవలు
జూన్ 28 వ తేదీ రాత్రి 8.30 గం టలకు గజవాహన సేవ, జూన్ 29 వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సే వ వైభవోపేతంగా జరుగనున్నాయి. తె ప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూ ర్తుల ఊరేగింపు నిర్వహించనున్నా రు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రో జుల పాటు నిర్వహించే కల్యాణోత్ సవం, ఊంజల్సేవలను, అలాగే జూన్ 26 న నిర్వహించే లక్ష్మీపూజ కూడా టిటిడి రద్దు చేసింది.
భక్తి సంగీతం – సాంస్కృతిక వై భవం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచా ర్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్ రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్ మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ వహించి భక్తులకు ఆధ్యాత్మికానం దాన్ని పంచనున్నారు.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య క టాక్షం పొందేందుకు భక్తులు పెద్ ద సంఖ్యలో హాజరై ఈ వార్షిక తెప్ పోత్సవాలను విజయవంతం చేయాలని టీ టీడీ కోరుతోంది.
No comments :
Write comments