ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం అనంతరం ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.
No comments :
Write comments