ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, అక్షరాభ్యాసం, అన్నప్రాశనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అని పేర్కొన్నారు. తొలి అక్షరం “గోవింద” నామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘అక్షరగోవిందంకిట్’ ఉచితపంపిణీ
ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులకు ‘అక్షర గోవిందం కిట్’ ఉచితంగా అందజేశారు. ఇందులో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్షతో పాటు పూజా, విద్యా సామగ్రి ఉన్నాయి.
రూ.2 కోట్లయాత్రికులవసతిసముదాయప్రారంభం
అనంతరం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన యాత్రికుల వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్, ఈవో సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ దర్శన్, శ్రీ ఎన్ సదాశివరావు, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, హెచ్డీపీపీ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, అదనపు కార్యదర్శి శ్రీమతి కల్యాణి, ఎస్ ఈ లు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డిప్యూటీ ఈవో లు శ్రీ శివప్రసాద్, శ్రీ ఆనంద రాజు, వీజీవో శ్రీ గిరిధర్, ఏఈఓ శ్రీ గోపీనాథ్, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, భక్తులు , శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
No comments :
Write comments