ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్వేత భవనం ఎదుట ఉన్న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పిస్తారు.
అనంతరం ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహితీ సేవలపై సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సుమారు 400 సంవత్సరాల పాటు మరుగున పడిన తాళ్లపాక అన్నమయ్య అమూల్య సాహిత్య సంపదను వెలికితీసి, భక్తి సాహిత్య ప్రపంచానికి అందించిన మహనీయుడు. ఆయన చేసిన అపారమైన సాహితీ సేవలు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అన్నమయ్య సాహిత్య పరిరక్షణకు, ప్రచారానికి శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి చేసిన మహోన్నత సేవలను స్మరించుకోనున్నారు.
No comments :
Write comments