18.8.26

ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేది వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమం shanti homam




రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3 తేదీ వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాల‌ను టీటీడీ నిర్వ‌హించ‌నుంది.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు యాగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞ‌న పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

No comments :
Write comments