13.8.26

ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం elephants day





ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా తిరుపతి ఎస్వీ గోశాలలో టిటిడి ఆలయ ఊరేగింపుల్లో పాల్గొనే లక్ష్మి, వైష్ణవి, పద్మావతి అనే మూడు ఆడ ఏనుగులకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం గోశాల డైరెక్టర్ శ్రీ ఎ.వి.ఎన్. శివకుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆలయ సంప్రదాయాల్లో భాగంగా సేవలందిస్తున్న గజరాజులను టీటీడీ ప్రేమతో, ఆధ్యాత్మిక భావంతో సంరక్షిస్తూ, వాటి ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు గజరాజుల పట్ల భక్తులకున్న గౌరవం, అనుబంధాన్ని చాటాయి.

ఈ కార్యక్రమంలో గోశాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments :
Write comments