గరుడపంచమి పర్
వదినాన్ని పురస్కరించుకొని సో
మవారం తిరుమలలో శ్రీమలయప్పస్వా
మివారు తమ ఇష్టవాహనమైన గరుడుని
పై తిరుమాడ వీధులలో విహరించి భక్తు
లను కటాక్షించారు. రాత్రి 7 గం
టలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది
.
శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.
గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments