18.8.26

శ్రీవారి పుష్కరిణీలో అదనపు ఈవో తనిఖీలు pushkarini




సెప్టెంబర్ 15 నుండి 23 తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణీ మరమ్మతు పనులను సోమవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పుష్కరిణీలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పుష్కరిణీ లోతు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ తనిఖీల్లో ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఈఈలు శ్రీ సుధాకర్, శ్రీ శ్రీనివాసరావు, డిఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments