22.8.26

తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి tarigonda vengmamba






భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209 వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న వెంగమాంబ విగ్రహానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. వేమ వెంకటరత్నం శుక్రవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంగీత కచేరి నిర్వహించారు.

సాయంత్రం 6 గంటల నుంచి హరికథ గానం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు ఏఈవో శ్రీమతి అరుణకుమారి, సూపరింటెండెంట్ శ్రీమతి ఎన్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments