As part of the Varalakshmi Vratam celebrations at Tiruchanoor Sri Padmavathi Ammavari Temple, Sri Padmavathi Devi blessed devotees with darshan on the Golden Chariot on Friday.
A large number of women devotees participated in the Golden Chariot procession and pulled the chariot along the four Mada Streets with devotion. Devotees offered camphor harathi, had darshan of the Goddess and sought Her blessings.
TTD JEO Dr. A. Sharath, Temple Deputy EO Sri Harindranath and a large number of devotees participated in the celebrations.
ఈ సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుండి విచ్చేసిన 16 మంది పండితులు తిరుమల నంబి జీవితంపై ఉపన్యాసాలు చేశారు.
101 సంవత్సరాలు నిండిన పండితుడు శ్రీ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పుండరీకాక్షుడు, భగవద్రామానుజులు, వేదాంత దేశికులు తిరుమల ప్రథమ పౌరుడైన శ్రీ తిరుమల నంబి మార్గంలో నడిచి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఇతోధికంగా వ్యాప్తికి తెచ్చారని తెలిపారు.
అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల నంబి వారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం.తిరుమళిశై ఆళ్వార్, తిరుమల నంబి వంశీయులు శ్రీ టి.కె.శేషాద్రి స్వామి, శ్రీ టి.కె.ముకుంద తాతాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
As part of the 209th death anniversary celebrations of saint-poet Matrusri Tarigonda Vengamamba, Special Officer of the Tarigonda Vengamamba Project, Dr. Vema Venkata Ratnam, paid floral tributes to her statue at M.R. Palli Circle in Tirupati on Friday.
As part of the second-day celebrations, a music concert by Annamacharya Project artistes was held at Annamacharya Kala Mandir from 10 am to 1 pm. A Harikatha performance will be held from 6 pm.
Vengamamba Project AEO Smt. Aruna Kumari, Superintendent Smt. N. Suseela, other officials and staff participated in the programme.
వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు.
మహిళలకుమంగళప్రదమైనవరలక్ష్మీవ్రతం
వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.
సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున, అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు.
భక్తులకువిస్తృతఏర్పాట్లు : టిటిడిజేఈవోశ్రీఏ. శరత్
టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.
వ్రత కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పుష్పసౌందర్యంతోకనువిందుచేసినవ్రతమండపం
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 14 రకాల 30 వేల కట్ ఫ్లవర్స్తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ముసాంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అష్టలక్ష్మి మూర్తులు, రంగురంగుల రోజాలు, తామరపూలతో ఆస్థాన మండపం శోభాయమానంగా అలంకరించారు.
7 ఎల్ఈడీస్క్రీన్లద్వారాప్రత్యక్షవీక్షణ
భక్తులందరూ వరలక్ష్మీ వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మండపం, పుష్కరిణి, వాహన మండపం, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్, గేట్ నం.3 తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
స్వర్ణరథంపైఅమ్మవారిదివ్యవిహారం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ సురేష్ కుమార్, శ్రీమతి జానకి దేవి, శ్రీమతి రంగశ్రీ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.