Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

12.3.26

Rs 20 Lakh Donation to TTD Trusts




A total donation of Rs.20 lakh has been received for the trusts run by TTD. Of this, Rs.10 lakh was donated to the Sri SV Gosamrakshana Trust and another Rs.10 lakh to the Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS).


The Directors of Rajendra Jewellery Private Limited, Mumbai, Shri Berulal Jain and Shri Meenesh Jain, offered the donation.


The donors handed over the DDs to TTD Executive Officer Shri M.. Ravichandra in his chamber at the TTD Administrative Building in Tirupati on Wednesday.

TTD Board Member Shri G. Bhanu Prakash Reddy was also present on the occasion.


The TTD EO Sri M. Ravi chandra appreciated the donors for their generous contribution.

మార్చి 17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు koil alwar tirumanjanam




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19 ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17 తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.


ఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవంవైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.


వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 


కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17 వీఐపీ బ్రేక్ దర్శనాలుఅష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16 తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


అదేవిధంగా మార్చి 19 ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది కారణంగా మార్చి 18 తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


మార్చి 24న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం vontimitta temple




ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24 తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05 తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా మార్చి 24 తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారుఅనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.


ఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అని స్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


మార్చి 25 పసుపు దంచే కార్యక్రమం :


ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25 ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారుమార్చి 27  ప్రారంభము కానున్ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 01 తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో  పసుపును వినియోగించనున్నారు.


47th Death Anniversary of Rallapalli Ananthakrishna Sharma Observed





The 47th death anniversary of Rallapalli Ananthakrishna Sharma was observed on Wednesday at Annamacharya Kalamandiram under the joint aegis of the Tirumala Tirupati Devasthanams Annamacharya Project and Hindu religious organizations.


Speaking on the occasion, Dr. Kodidala Shobha, Telugu Lecturer of SPW Women’s Degree and PG College, said that Rallapalli rendered remarkable service by deciphering the Sankeertanas of Tallapaka Annamacharya from copper plates and setting them to musical tunes.


Telugu scholar Dr. Malepattu Purushottamachari highlighted the life and literary contributions of Rallapalli, while retired professor Acharya Damodar Naidu of Sri Venkateswara University spoke about Rallapalli’s role as a distinguished literary critic.


Earlier, TTD officials paid floral tributes to the statue of Rallapalli Ananthakrishna Sharma near Sri Padmavati Mahila Visvavidyalayam.


Acharya Rallapalli Deepta of National Sanskrit University, Annamacharya Project Special Officer Sri Medasani Mohan, Director Smt. Latha, officials and devotees were present.

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ రాళ్ళ‌ప‌ల్లి అనంత‌కృష్ణ శ‌ర్మ 47వ వ‌ర్థంతి rallapalli ananta krishna






శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో శ్రీ రాళ్ళ‌ప‌ల్లి అనంత‌కృష్ణ శ‌ర్మ విశేష కృషి చేశారని ఎస్‌పిడ‌బ్ల్యూ మ‌హిళా డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల తెలుగు అధ్యాప‌కులు డా.శోభ తెలిపారుటీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టుహిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం ఉద‌యం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 47 వ‌ర్థంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.


 సంద‌ర్భంగా డాశోభ “రాళ్లపల్లి వారు దర్శించిన సారస్వతా లోకము” అనే అంశంపై మాట్లాడుతూరాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు తెలుగు సాహిత్యంలోని విశాలమైన సారస్వత ప్రపంచాన్ని లోతుగా అధ్యయనం చేసి తమ రచనల ద్వారా పాఠకులకు పరిచయం చేసిన మహానుభావులని తెలిపారుఆయనకు ఉన్న విస్తృతమై పాండిత్యంసాహిత్యంపై ఉన్న పారమైన అభిరుచిపరిశీలనాత్మక దృష్టి కారణంగా సాహిత్యంలోని వివి ప్రక్రియలను సమగ్రంగా అర్థం చేసుకుని వాటి సౌందర్యాన్ని స్పష్టంగా వివరిస్తూ సాహిత్యాభిమానులకు మార్గదర్శకత్వం చూపారని ఆమె పేర్కొన్నారురాళ్లపల్లి వారు తమ రచనల ద్వారా తెలుగు సారస్వతాన్ని సమృద్ధిగా చేసి సాహిత్య లోకానికి చిరస్థాయిగా నిలిచే సేవలు అందించారని ఆమె కొనియాడారు.


త‌రువాత న‌గ‌రికి చెందిన తెలుగు పండితులు డామలేపట్టు పురుషోత్తమాచారి “రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారి జీవితం – రచనలు” అనే అంశంపై మాట్లాడుతూరాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు తెలుగు సాహిత్యం మరియు సంగీత రంగాలలో విశిష్టమైన సేవలు చేసిన మహనీయులని తెలిపారుఆయన జీవితమంతా సాహిత్యాభివృద్ధికి అంకితమై ఉండి అనేక విలువైన రచనలు చేసి తెలుగు భాషకు కీర్తి తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ఆయన పండితత్వంసంగీతంపై ఉన్న లోతైన జ్ఞానం మరియు సాహిత్యంపై ఉన్న అభిరుచి కలిసి ఆయనను గొప్ప రచయితగాపండితునిగా నిలబెట్టాయని కొనియాడారు.


అనంత‌రం ఎస్‌వి విశ్వ‌విద్యాల‌యం విశ్రాంత అచార్యులు ఆచార్య దామోదర్ నాయుడు “విమర్శకుడిగా రాళ్లపల్లి” అనే అంశంపై ప్రసంగిస్తూరాళ్లపల్లి వారు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం పొందిన మహనీయులని కొనియాడారురాళ్లపల్లి గారు కేవలం సంగీత విద్వాంసుడిగానే కాకుండాసాహిత్యాన్ని లోతుగా అర్థం చేసుకుని విశ్లేషించే నిశితమైన విమర్శనా దృష్టి కలిగిన గొప్ప సాహిత్య విమర్శకుడిగా గుర్తింపు పొందారని చెప్పారువారి విమర్శలు లోతైన అధ్యయనంనిష్పాక్షికత మరియు విశ్లేషణాత్మకతతో కూడి ఉండి తెలుగు సాహిత్య విమర్శకు విశేష సేవ చేశాయ‌ని వివ‌రించారు.


పుష్పాంజలి :


కాగాఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.


 కార్యక్రమంలో  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ మేడ‌సాని మోహ‌న్‌సంచాలకులు శ్రీమ‌తి ల‌త‌,  ఇతర అధికారులుపుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు

2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యా శాఖకు రూ.118.89 కోట్లు digital class rooms





టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి  కేటాయించిందిఅత్యాధునిక సాంకేతికతవిద్యార్థుల సామర్థ్యాల పెంపునైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.


గతంలో టిటిడి విద్యా శాఖలో జీతాలు  మినహా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.24.37 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.39.04 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.33.08 కోట్లు, 2024–25 సంవత్సరానికి రూ.25.99 కోట్లు, 2025–26 సంవత్సరానికి రూ.13.08 కోట్లు కేటాయించారు నిధులతో భవనాల నిర్మాణంమౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులు చేపట్టారు.


 ఏడాది  2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ మరియు టిటిడి కలిపి విద్యాసంస్థలను మరింత ఆధునికరించి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మొత్తం రూ.118.89 కోట్లు కేటాయించారు


టిటిడి విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు నేపథ్యంలో టిటిడి విద్యా సంస్థల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈసారి రూ.118.89 కోట్ల నిధులను కేటాయించారు నిధులతో టిటిడి విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులుఅదనపు వసతి గదుల నిర్మాణంపాఠశాలలు మరియు కళాశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి స్పోర్ట్స్సాంస్కృతిక మరియు సహ పాఠ్య కార్యకలాపాలుటీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారుపోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం ఐఐటీనీట్సీఏక్లాట్ రహా కోర్సులుస్కిల్ డెవలప్‌మెంట్జాబ్ ఓరియెంటెడ్ మరియు వృత్తి ఆధారిత కోర్సులను  అందుబాటులోకి తీసుకురానున్నారు.


అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్కంప్యూటర్లుస్మార్ట్ ప్యానల్ బోర్డులుకంప్యూటర్ ల్యాబ్‌లువర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాఠశాలలుకళాశాలలలో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంమొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.


ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విద్యాసంస్థల (ఎస్పీడబ్ల్యూ జూనియర్ఎస్పీడబ్ల్యూ డిగ్రీపాలిటెక్నిక్ కళాశాలలు)లో చదువుతున్న విద్యార్థినులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.


టిటిడి పాలక మండలి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ఎంరవిచంద్రటిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ పర్యవేక్షణలో టిటిడి విద్యా శాఖను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు.