ఆణిమాసం చివరి రోజున నిర్వహించే ఈ విశిష్ట కొలువును ఆణివార ఆస్థానంగా పిలుస్తారు. మహంతుల కాలంలో దేవస్థాన పరిపాలన, ఆదాయ-వ్యయ లెక్కలు, నిల్వలు ప్రారంభమయ్యే పర్వదినంగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
శ్రీగోవిందరాజస్వామివారిఆలయంలో
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు.
శ్రీకోదండరామస్వామివారిఆలయంలో
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా తీసుకొచ్చి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు సమర్పిస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జీయర్ స్వాములు, ఆలయ అధికారులు పాల్గొంటారు.
No comments :
Write comments