22.7.26

జూలై 24 నుంచి 26 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం jyestabhishekam


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జూలై 24 నుంచి 26 తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు

ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణకవచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు.

మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు

•  జూలై 24 – కవచాధివాసం

•  జూలై 25 – కవచ ప్రతిష్ఠ

•  జూలై 26 – కవచ సమర్పణ

ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడతాయి.

ఆషాఢ మాసంలో వార్షిక వైభవం

ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు.

No comments :
Write comments