11.7.26

ఆ దివ్యాంగురాలిని ఆదుకుంటాను.. చదలవాడ శ్రీనివాసరావు




ప్రకృతి వల్ల కలిగిన విపత్తులలోనే కాకుండా ఇలాంటి సందర్భంలో కూడా మనుషులు మానవతా 

దృక్పదంతో ఆలోచించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు  

చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోరాజ్ కుమార్ అనే ప్రబుద్దుడు తన భార్య 

ఇద్దరు పిల్లలతో పాటు తనపై కేసుపెట్టిన మైనర్‌ బాలిక..ఆమె తల్లిని అత్యంత దారుణంగా  హత్య చేసిన 

విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ  .. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేంత 

దారుణమైనది. సమాజం ఆధునికంగా ఎంతో ముందుకు వెళుతున్నా ఇలాంటి ఆటవిక చర్యలు ..మాత్రం 

ఆగడంలేదు. మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అంతు చిక్కడం లేదు. ఈ 

పాశవిక చర్య నా మనసును తీవ్రంగా భాదించింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అనే ది 

అస్సలు అర్థం కావడంలేదు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే ఆ బాధిత 

కుటుంబంలో మిగిలి ఉన్న ఉన్న దివ్యాంగురాలికి ఊరి పెద్దలతో మాట్లాడి ..ఆమెకు కావలసిన తోడ్పాటు 

అందజేయనున్నాను....అన్నారు. ప్రఖ్యాత నిర్మాత,  దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు.. గతంలో 

కూడా చదలవాడ శ్రీనివాసరావు కరోనా సమయంలో సినిమా పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల నుండి 

నిర్మాతల వరకు ఆర్థికంగా ఆదుకుని తన దయా గుణాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా గతంలో 

ఎంతో మంది అనాధలైన దివ్యాంగులకు ఆయన తన వంతు చేయూత నిచ్చారు.

No comments :
Write comments