సకల జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణుని మహిమను ప్రతిబింబించే సూర్యప్రభ వాహనంపై శ్రీహరి దర్శనం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. ఈ వాహనసేవను దర్శించిన భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సత్సంతాన భాగ్యం, సకల శుభాలు సిద్ధిస్తాయని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
నేడురాత్రిచంద్రప్రభవాహనసేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
జూలై 2నవైభవంగారథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం (జూలై 2) ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8.45 గంటల నుండి 10.15 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో రథంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగుతుంది.
ఈ వాహనసేవలో ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments