నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు చిరంజీవి కోడెల గౌతం రూ.10 లక్షలు, చిరంజీవి కోడెలa జేయాదిత్య రూ.10 లక్షలు విరాళంగా అందించినట్లు తెలిపారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందించారు.
పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు విరాళం అందించిన డా. కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు.
భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.
No comments :
Write comments