15.8.26

టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి Independence Day celebrations




ఆగస్టు 15 నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు.

శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

జెండా వందనం అనంతరం టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు 5 గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. 

చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

No comments :
Write comments