17.8.26

నడక దారిలో ధూమపానం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు walking path




అలిపిరి నడక మార్గంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది.

నిబంధనల ప్రకారం తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు, ఇతర టీటీడీకి చెందిన ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించడం పూర్తిగా నిషేధం.

ఈ విషయం తెలిసినప్పటికీ సదరు భక్తుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నడకమార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్య.

ఇలా టీటీడీ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది. అదేవిధంగా  తనిఖీలలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బంది పై తగు క్రమశిక్షణ చర్యలు  తీసుకోవడం జరుగుతుంది. 

No comments :
Write comments