25.7.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం jyestabhishekam





తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా చేపట్టారు.

అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో విశేష అభిషేకం చేసి, అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు.

సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Ankurarpanam for Sri Kapileswara Swamy Vari Temple Pavitrotsavams on 25th July




The annual Pavitrotsavams of Sri Kapileswara Swamy Temple, Tirupati, will be held from July 26 to 28, with Ankurarpanam scheduled on July 25 from 6.00 p.m. to 8.30 p.m.

The three-day festival will feature Pavitra Pratishtha on July 26, Granthi Pavitra Samarpana on July 27 and Maha Poornahuti on July 28. The rituals are performed every year as per Shaiva Agama traditions to preserve the sanctity of the temple and as atonement for any ritual lapses.

Devotees can participate by paying Rs.700 per couple. Participants will receive one laddu, an upper cloth, blouse piece and Pavitra Malas on the concluding day.

నందివిద్య నటేశ్వరి' కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు – శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిnandini nateswari





టీటీడీ, హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన "ప్రజల వద్దకు ధర్మం" అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ కళల పట్ల అభిరుచిని పెంపొందించేందుకు 'నందివిద్య నటేశ్వరి' కార్యక్రమాన్ని రూపొందించినట్లు శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 100 పాఠశాలల్లో  నిర్వహించిన 'నందివిద్య నటేశ్వరి' కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో స్వామివారు వర్చువల్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు.

విద్యార్థుల్లో కళాభిరుచి, క్రమశిక్షణ, సంస్కార విలువలను పెంపొందించే లక్ష్యంతో మృదంగం, భారతీయ నృత్య కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2025 డిసెంబరులో 50 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విశేష ఆదరణతో ఈ ఏడాది 100 పాఠశాలలకు విస్తరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు టీటీడీ విద్యాసంస్థలు పాల్గొనగా, తిరుపతి ప్రాంత పాఠశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.

'నందివిద్య నటేశ్వరి' అనే నామం శ్రీలలితా సహస్రనామంలోని 733, 734 నామాల నుండి ఆవిర్భవించిందని స్వామివారు వివరించారు.

జూలై 23న ఏకకాలంలో 100 వేదికలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించి విజయవంతంగా ముగిసింది.

ధర్మప్రచారానికి టీటీడీ చేయూత

సనాతన ధర్మ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో యువతలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తగు ఆర్థిక సహాయంతో పాటు శ్రీవారి సుప్రభాతం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను పుస్తక ప్రసాదంగా ఉచితంగా అందజేశారు.

ప్రముఖ కళాకారులకు ఘన సన్మానం ఆకట్టుకున్న ఆధ్యాత్మిక కళాప్రదర్శనలు

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఏ. శరత్ చెన్నైకి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మవిభూషణ్ డా.  ఉమయాళ్‌పురం కె. శివరామన్, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి రేవతి రామ్మోహన్లను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు అందించిన ప్రత్యేక కళాప్రదర్శనలు ప్రేక్షకులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి.

తదనంతరం తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన 'అష్టలక్ష్మి వైభవం' నృత్యరూపకం భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జూలై 25న శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ kapileswara swamy vari temple




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28 తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలకు జూలై 25 తేదీ శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించనున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్యార్చనలు, ఉత్సవాల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాలకు ప్రాయశ్చిత్తంగా, ఆలయ పవిత్రతను పరిరక్షించే మహోన్నత సంకల్పంతో శైవాగమ శాస్త్రోక్త విధానంలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవ అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులకు కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతుంది.

రూ.700 టికెట్‌తో గృహస్తులు (ఇద్దరు) పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికెతో పాటు ఉత్సవాల చివరి రోజు పవిత్రమాలలను ప్రసాదంగా అందజేస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని అనుగ్రహం పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది.

TTD EO Calls for more Creative and Devotional SVBC Programmes





TTD Executive Officer Sri Muddada Ravichandra directed officials to produce creative, high-quality programmes on Sri Venkateswara Bhakti Channel (SVBC) that inspire greater devotion among devotees across the world.

During a review meeting held on Friday with TTD JEO and SVBC CEO Dr. A. Sharath, the EO reviewed the channel's daily broadcasts and future programme plans.

The EO suggested developing simple and engaging programmes highlighting the significance of Tirumala's temples, mandapams, prakarams, sacred theerthams, sub-shrines, and Srivari prasadams. He said the programmes should effectively convey the spiritual glory of Tirumala and the greatness of Lord Venkateswara.

Stating that millions of devotees worldwide watch SVBC, the EO stressed that every programme should be interesting, devotional, and maintain the highest quality standards. He also directed officials to introduce more innovative spiritual content based on devotees' interests.

Earlier, Dr. A. Sharath informed the EO that the recently launched "Mahalakshmi Deepa Puja" programme, initiated with the support of HDPP, has received an encouraging response and will be expanded to rural areas. He also said special spiritual, religious, and cultural programmes featuring renowned artists from across the country are being planned during the upcoming Srivari Brahmotsavams.

Before the review, the EO visited the model temple, inspected various SVBC studios, editing and spiritual content sections, and offered several suggestions. He also advised the staff to use electricity and air conditioners judiciously and interacted with sanitation workers to enquire about their welfare.

SVBC CPO Sri A.C. Sri, SE Sri Manoharam, Accounts Officer Sri Viswanatha Rayal, and other officials were present.

తిరుచ్చిపై కూర్మావతారంలో భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామి koormavataram





నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు తిరుచ్చిపై కూర్మావతార అలంకారంలో గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.


గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా సాగిన వాహనసేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు.


సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.


వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.