24.7.26

జూలై 31న టీటీడీ వాడిన ఖాళీ గోనె సంచుల ఈ–వేలం e-auction




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు "రేట్ కాంట్రాక్ట్" ప్రాతిపదికన విక్రయించేందుకు జూలై 31 -వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు జూలై 30వ తేదీ సాయంత్రం లోపు Konugolu పోర్టల్ ద్వారా రూ.30,000/- ఈఎండీ (EMD) చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను https://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్ లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు. 

No comments :
Write comments