22.7.26

జూలై 24 నుంచి 26 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం jyestabhishekam


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జూలై 24 నుంచి 26 తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు

ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణకవచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు.

మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు

•  జూలై 24 – కవచాధివాసం

•  జూలై 25 – కవచ ప్రతిష్ఠ

•  జూలై 26 – కవచ సమర్పణ

ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడతాయి.

ఆషాఢ మాసంలో వార్షిక వైభవం

ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు.

ANKURARPANAM PERFORMED FOR SRI SOUMYANATHA SWAMY BRAHMOTSAVAMS BRAHMOTSAVAMS TO BEGIN WITH DWAJAROHANAM ON JULY 22



The annual Brahmotsavams of the ancient and renowned Sri Soumyanatha Swamy Temple at Nandalur in Kadapa district commenced with the traditional Ankurarpanam ceremony on Tuesday evening.

The rituals began in the morning with Suprabhata Seva, Thomala Seva, and Sahasranamarchana. In the evening, Veda Parayanam, Senadhipati Utsavam, Medini Puja, Mrutsangrahanam, and Ankurarpanam were performed as per Agama traditions, marking the formal commencement of the festivities.

Dwajarohanam on July 22

The Brahmotsavams will officially begin with Dwajarohanam on Wednesday between 7.45 a.m. and 8.15 a.m. Before the flag-hoisting ceremony, Sri Soumyanatha Swamy along with Sridevi and Bhudevi, Dhwajapatam, and Chakrathalwar will be taken in a sacred procession from 6.00 a.m. to 7.30 a.m.

Temple of Wish Fulfilment

Sri Soumyanatha Swamy is revered as the fulfiller of devotees' wishes. It is believed that performing nine pradakshinams around the sanctum fulfills one's prayers, while devotees traditionally perform 108 pradakshinams after their wishes are fulfilled.

A Temple with Rich Heritage

Built in the 11th century, the temple was renovated during the rule of the Pandya, Kakatiya, and Vijayanagara dynasties. It houses inscriptions dating from the 10th to the 17th century and has two sacred temple tanks, one inside and another outside the temple premises.

Saint-poet Tallapaka Annamacharya composed 16 Sankirtanas in praise of Sri Soumyanatha Swamy. The temple is also known for its unique pillars adorned with lion sculptures, giving rise to the local belief that another temple exists beneath the present structure.

Temple Deputy EO Smt. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, Srivari Sevaks, and other officials participated in the ceremony.

శాస్త్రోక్తంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జూలై 22న ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాల ఆరంభం ankurarpanam



కడప జిల్లా నందలూరులోని ప్రాచీన, ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా మేదినీపూజ, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేదప్రబంధ శాత్తుమొర జరగగా, ఆపై సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

జూలై 22 ధ్వజారోహణం

బుధవారం ఉదయం 7.45 గంటల నుండి 8.15 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.

కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం శ్రీ సౌమ్యనాథుడు

శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడిగా విశేష ఖ్యాతి పొందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మనోరథాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరిన అనంతరం 108 ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్ర విశిష్ట సంప్రదాయంగా కొనసాగుతోంది.

వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన దివ్యక్షేత్రం

11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజుల పరిరక్షణలో పునర్నిర్మాణం పొందింది. ఆలయ గోడలపై 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు చెందిన శాసనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో ఒకటి, వెలుపల మరొకటి ఇలా రెండు పవిత్ర కోనేరులు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

మహాకవి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని కీర్తిస్తూ 16 సంకీర్తనలు రచించారు. అలాగే ఆలయ మండపంలోని స్తంభాలపై సింహాల శిల్పాలు ప్రత్యేక శైలిలో చెక్కబడి ఉండడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఆలయం క్రింద మరో ఆలయం ఉందని స్థానికులు విశ్వసిస్తుంటారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, అధికారులు పాల్గొన్నారు.

SRI GOVINDARAJA SWAMY TEMPLE TO OBSERVE JYESHTABHISHEKAM FROM JULY 24 TO 26


The annual Jyeshtabhishekam (Abhideyaka Abhishekam) of the processional deities of Sri Govindaraja Swamy with Sridevi and Bhudevi will be observed at Sri Govindaraja Swamy Temple, Tirupati, from July 24 to 26.

During the three-day festival, the golden armour (Swarna Kavacham) of the deities will be ceremonially removed, purified, and re-adorned as per Agama traditions.

The rituals include Kavachadhivasam (July 24), Kavacha Pratishtha (July 25), and Kavacha Samarpana (July 26). Every day, Mahashanti Homam, Punyahavachanam, Snapana Tirumanjanam, Satakalasa Snapanam, and Veedhi Utsavam will be conducted.

Jyeshtabhishekam is an annual festival observed during the Ashada month on Jyeshta Nakshatram.

అలిపిరి చెక్‌పాయింట్‌లో మరిచిపోయిన బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ttd vigilance


తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును తమ ఆధీనంలోకి తీసుకుని పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ బ్యాగు హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహేష్ కు చెందినదిగా గుర్తించారు. అప్పటికే తాను బ్యాగును మరిచిపోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించి, పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా అప్పగించారు.

టీటీడీ యాజమాన్యానికి,  విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు శ్రీ మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. 

21.7.26

₹1Cr Donation to TTD



Sri Tirumala Kumar Kanakamedala, CEO of Anblicks Cloud Data Engineering Private Limited, Vijayawada, donated Rs. One crore to the TTD Sri Venkateswara Vidyadana Trust on Monday.

The donor handed over the donation DDs to TTD Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam inside the Sri Venkateswara Temple.


Sri Kalyana Venateswara Swamy Vari Paruveta Utsavam Celebrated with Grandeur






The annual Paruveta Utsavam of Sri Kalyana Venkateswara Swamy was celebrated with great religious fervour on Monday at Srinivasamangapuram, near Srivari Mettu, the sacred path believed to have been traversed by Lord Venkateswara

The processional deities were taken in a grand procession from the temple to the Paruveta Mandapam at 7 a.m. amid Vedic chanting and traditional music. After the customary offerings, the Paruveta ritual was performed. 

A special highlight of the festival was the symbolic act of the Lord throwing the spear three times, signifying the destruction of evil. An Asthanam was also held, and the deities were taken back to the temple in the evening.

As part of the celebrations, artists from the TTD Annamacharya Project rendered devotional Sankirtans, while Bhajan groups performed devotional songs and Kolatam, creating a spiritually vibrant atmosphere. Anna Prasadam was distributed to devotees near Srivari Mettu.

TTD JEO Dr. A. Sharath, Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Raj Kumar, temple priests led by Sri Balaji Rangacharyulu, Temple Inspectors Sri Munikumar and Sri Dhanasekhar Jaya, other officials, priests, and a large number of devotees participated in the event.