26.7.26

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ ankurarpanam



తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28 తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక విత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివార్ల పంచమూర్తులతో తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

TTD Employee Suspended




 TTD has suspended Mr. N. Sharath Babu, who was working as an Office Subordinate in the GNC area at Tirumala, on Saturday.

An inquiry was initiated following allegations that the employee had behaved inappropriately with a devotee, in violation of the prescribed rules.

Upon preliminary inquiry, TTD found that the employee's conduct was in violation of service rules. As part of disciplinary proceedings, orders were issued placing him under immediate suspension.

Sri Soumyanatha Swamy Varu Blesses Devotees as Sri Kodandarama On Hanumanatha Vahanam


As part of the annual Brahmotsavams of Sri Soumyanatha Swamy Temple at Nandalur, the deity appeared in the divine attire of Sri Kodanda Rama and blessed devotees on Hanumantha Vahanam on Saturday night.

Thousands of devotees witnessed the sacred procession, offering camphor harathi with deep devotion. Traditional kolatam performances, chekka bhajans, and auspicious musical ensembles added spiritual fervour and grandeur to the celebration.

According to Agama scriptures, darshan of Sri Soumyanatha Swamy in the form of Sri Kodanda Rama on Hanumantha Vahanam is believed to bestow prosperity, spiritual wisdom, courage, protection, and good health upon devotees.

The procession was attended by AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, temple priests, officials, and a large number of devotees

హనుమంత వాహనంపై శ్రీ కోదండరాములవారి దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించిన శ్రీ సౌమ్యనాథస్వామి hanumath vahanam


నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీ కోదండరాములవారి దివ్య అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

శ్రీరామభక్త హనుమంతుని వాహనంపై విరాజిల్లిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. భక్తబృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నినాదాలు ఉత్సవానికి మరింత వైభవాన్ని చేకూర్చాయి.

ఆగమ శాస్త్రాల ప్రకారం హనుమంత వాహనంపై శ్రీ కోదండరాములవారి స్వరూపంలో దర్శనమిచ్చే శ్రీ సౌమ్యనాథస్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించిన వారికి భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

ఈ వాహనసేవలో ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

TTD Clarifies on Appearance of Water at Japali Anjaneya Temple




Following the reports circulating on social media regarding the temporary white appearance of water from taps at the Sri Japali Anjaneya Swamy Temple, Tirumala, TTD officials on Saturday confirmed the phenomenon is caused by microscopic air bubbles introduced when water is released under high pressure. 

The aeration makes the water appear cloudy momentarily; video evidence shows the water returning to its normal clear state within a few seconds. 

Experts emphasize this is a physical effect and not indicative of contamination.

Water samples were submitted to the TTD Food and Water Analysis Laboratory for evaluation. Laboratory tests confirmed the water is clean and safe for use, with no foul odour, sediment, or visible impurities detected.

TTD urges devotees and the public not to share or amplify unverified information on social media and assures everyone there is no cause for concern regarding the quality of water at the temple.

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు dhwajarohanam






తాళ్లపాకలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవస్వామివారి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయాల్లో వార్షి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

రెండు ఆలయాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ధ్వజారోహణ మహోత్సవాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించి, బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో ఉత్సవ విశేషాలు

ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి శేషవాహన సేవ భక్తులను అలరించనుంది.

ఉత్సవాల షెడ్యూల్:

జూలై 26: ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంసవాహనం

జూలై 27: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం

జూలై 28: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం

జూలై 29: ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ)

జూలై 30: సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం

జూలై 31: సాయంత్రం 6 గంటలకు రథోత్సవం

ఆగస్టు 1: రాత్రి అశ్వవాహనం

ఆగస్టు 2: ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం

ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఉత్సవ విశేషాలు

ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది.

ఉత్సవాల షెడ్యూల్:

జూలై 26: ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం

జూలై 27: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం

జూలై 28: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం

జూలై 29: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నందివాహనం

జూలై 30: సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం

జూలై 31: సాయంత్రం పల్లకీ సేవ

ఆగస్టు 1: సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం

ఆగస్టు 2: వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం

ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.

జూలై 30 ఆర్జిత కల్యాణోత్సవం

రెండు ఆలయాల్లోనూ జూలై 30న ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300 చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, అన్నప్రసాదం అందజేయనున్నారు.

ఆగస్టు 3 పుష్పయాగం

ఆగస్టు 3న ఉదయం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.

ఆధ్యాత్మికసాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నారు.

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం dasa sahityam




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించే దాససాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన, అర్హులైన సంగీత కళాకారుల నుంచి టీటీడీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ఆడిషన్లు 2026 నవంబరు 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఆరు రోజులపాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించబడనున్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే https://apps.tirumala.org/dsp/ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలి.

అభ్యర్థుల అర్హతలు, ఆడిషన్ విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఆడిషన్ ప్రక్రియలో టీటీడీ ఎటువంటి ఏజెంట్లు, మధ్యవర్తులు లేదా ప్రతినిధులను నియమించలేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు అనధికార వ్యక్తులను నమ్మకుండా, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.